భూమి మీద మానవ జన్మ తీసుకున్న తరువాత 'చుట్టంలా వచ్చాను.. చూసెళ్లి పోతాను' అంటే కుదరదు. మంచి సమాజాన్ని భావి తరాలకు అందించడానికి మన వంతు కృషి చేయాలి. జనాలతో మమేకం కావాలి. ముఖ్యంగా యువత తో మన అనుభవాలు పంచుకోవాలి. ANSET మిత్రులు సునీల్ కుమార్ రెడ్డి మరియు చిగిచెర్ల శ్రీనివాసులు వలన నాకు యువతతో interact అయ్యే అవకాశం ఇంచుమించు నెలకు ఏడు సార్లు వస్తోంది. వారి కార్యక్రమం లో భాగంగా ఈ రోజు నేను TTDC లో శిక్షణ పొందుతున్న 60 మంది యువత లో నైపుణ్యాభివృద్ది గురించి అవగాహన కలగజేసాను. నైపుణ్యం ఉంటే డబ్బును ఎక్కడైనా సృష్టించవచ్చు. నైపుణ్యం ఉన్న వాడిని సమాజం గౌరవిస్తుంది. యువతలో నైపుణ్యాలు అభివృద్ధి పరిస్తే, నిరుద్యోగం మటుమాయమవుతుంది.
ఇక్కడ శిక్షణలో పాల్గొంటున్న యువతీ యువకులు చక్కటి క్రమశిక్షణ తో వ్యవహరించారు. చాలా మంది వారికున్న లక్ష్యాల గురించి మాతో ముచ్చటించారు. వీరిని చూస్తుంటే, నా దేశం భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే భరోసా నాకు కలిగింది.
రేపు మరో కార్యక్రమానికి సిద్ధం అయిపోయాను మరి.
💐🌹👌🌹🤝🌹🙏🌹🇮🇳🌹💐
ReplyDelete