Sunday, January 26, 2025

                                            అనంతపురం ITI తో నా అనుబంధం 

ITI అంటే Industrial Training Center అని అర్థం. భారత కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణా కేంద్రాలు విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తుంటాయి. ఇవన్నీ కూడా skill based courses అంటే నైపుణ్య విద్యలు. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం మరియు అనంతపురం లో మంచి మౌలిక సదుపాయలు కలిగిన ITI లు ఉన్నాయి. అనంతపురం ITI తో నా అనుబంధం బాల్యం నుంచి కొనసాగుతూ ఉంది. ఈ ITI కి చాలా పెద్ద మైదానం ఉంది. మంచి తరగతి గదులు ఉన్నాయి. అనేక రకాల trades లో విద్యార్థులకు శిక్షణను ఇస్తున్నారు. ఈ ITI మైదానం లోనే నేను నా బాల్యం లో సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను. నా తల్లి తండ్రి నాకు నడక, నడత నేర్పిస్తే, ఈ ITI ప్రాంగణ మైదానం నాకు సైకిల్ తొక్కడం నేర్పించింది. ఈ ITI అప్పట్లో సైరన్ మ్రోగించేది. రేడియో లు మాత్రమే ఉన్న ఆ రోజుల్లో అనంతపురం ప్రజలు ఈ ITI సైరన్ విని గడియారాలలో సమయం సరి చేసుకునేవారు. 

నేను డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా చేరిన చాలా కాలానికి నేను ANSET కార్యక్రమాల కోసం ITI లోకి ప్రవేశించాను. ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలకు, అబ్బాయిలకు వేరు, వేరుగా శిక్షణను ఇస్తున్నారు. 

24 జనవరి 2025 సాయంత్రం అనంతపురం ITI ప్రిన్సిపల్ రామ్మూర్తి గారు నన్ను మా కళాశాలకు వచ్చి రిపబ్లిక్ దినోత్సవానికి ఆహ్వానించారు. వెంటనే ఒప్పుకున్నాను. వారు చెప్పినట్టే గణతంత్ర దినోత్సవం రోజు ఉదయం 7.55 కు ITI కి వెళ్లాను. ప్రిన్సిపల్ రామ్మూర్తి గారు మరియు ఇతర ట్రైనింగ్ ఆఫీసర్స్ నన్ను సాదరంగా ఆహ్వానించారు. వారి ఐక్యత అందరికీ ఆదర్శప్రాయం. క్యాంపస్ అంతా చాలా పరిశుభ్రంగా ఉంది. ఎంత వెతికినా కొద్దిగా కూడా చెత్త కనిపించదు. గణతంత్ర దినోత్సవానికి చాలా మంది విద్యార్థులు హాజరయ్యారు. ITI విద్యార్థులకు, సంప్రదాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చాలా తేడా ఉంది. ITI లలో విద్యతో పాటు నైపుణ్యాన్ని అందిస్తారు. Experiential learning అనేది ఒక ITI లలోనే సాధ్యం. అన్ని ట్రేడ్స్ లో కూడా విద్యార్థులకు చక్కటి రీతిలో hands on training ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఉద్యోగాల కోసం వేచి ఉండకుండా స్వయంగా ఉపాధిని పొందగలుగుతారు. Skill India మరియు Make in India లాంటివి ITI విద్యార్థుల ద్వారానే సాకారం అవుతాయి. 

ఈ రిపబ్లిక్ డే రోజున ITI ప్రాంగణం లో నేను జాతీయ పతాకావిష్కరణ చేశాను. తదుపరి విద్యార్థులనుద్దేశించి రామ్మూర్తి గారు నేను ప్రసంగించాము. గణతంత్ర వేడుకలలో భాగంగా విద్యార్థులకు పోటీలు వీరు నిర్వహించారు. నలభై మంది విజేతలకు బహుమతి ప్రదానం చేశాము. ముఖ్య అతిథిగా విచ్చేసిన నన్ను సన్మానించిన తరువాత నూతన సంవత్సర కాలెండర్ ను ఆవిష్కరించాము. 

కార్యక్రమం తదుపరి ఉపాహారం సేవించి, నా కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవ్వడానికి బయలుదేరాను. 











No comments:

Post a Comment

                           Collaborative Work With District Science Center, Anantapur   In collaboration with the District Science Center an...